చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

Fatal road accident in Chittoor district.. Four killed..
Fatal road accident in Chittoor district.. Four killed..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా వడమాలపేట చెక్‌పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది . దీంతో… రోడ్డుకు అడ్డంగా పడిన లారీని ఢీకొట్టింది మరో కారు.

ఈ తరుణంలోనే కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత కారును ఢీకొంది మరో బైక్. దీంతో మరో ఇద్దరు మృతి చెందారు. ఇలా వరుసగా వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొట్టుకోవడంతో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.