ఇద్దరు ఆడపిల్లలకు ఉరివేసి…ఆత్మహత్య చేసుకున్న తండ్రి

lover suicide

సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసయైన తండ్రి ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లచ్చపేటకు చెందిన రాజేందర్ భార్య గత ఏడాది చనిపోయింది. అప్పటి నుంచి తాగుడుకు బానిసై ఉన్న ఇద్దరు ఆడపిల్లలను పట్టించుకునేవాడు కాదు. మద్యం తాగి వచ్చి రోజూ కూతుళ్లని కొడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇంటికి తాగి వచ్చాడు. మద్యం మత్తులో ఇద్దరు కూతుళ్లను ఉరివేసి చంపాడు. అనంతరం తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే పిల్లలను పోషించే స్థోమత లేకే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.