ఫిలింనగర్‌లో దారుణం….యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు !

filmnagar-friends-who-beat-the-young-man

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ్ అనే యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హతమార్చారు. ప్రేమ్, సతీశ్ ఇద్దరు స్నేహితులు ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. అందుతున్న సమాచారం  ప్రకారం నిన్న మధ్యాహ్నం సతీశ్ అనే యువకుడు గంజాయి తాగుదామని ప్రేమ్‌ను పిలిచినట్లు తెలుస్తోంది.

ఇద్దరూ కలిసి గంజాయి సేవించిన అనంతరం ఆ మత్తులో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సతీశ్ అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. సతీశ్‌తో పాటు మరి కొంత మంది యువకులు ప్రేమ్‌పై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.ప్రేమ్‌కి, సతీశ్‌కి కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.