అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బృందం

first group amarnath yatra started

అమర్‌నాథ్ యాత్ర కోసం తొలి బృందం ఆదివారం బయలుదేరింది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి 2,234 మంది భక్తులు జమ్ములోని బేస్ క్యాంప్ నుంచి బయలుదేరారు. ఈ మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ ఏడాది 1.5 లక్షలకుపైగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ జమ్ము రీజియన్ ఐజీ చౌహాన్ మాట్లాడుతూ భక్తులకు యాత్ర పొడవునా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. యాత్రికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు.