హీరో సతీష్ జై స్వయంగా దర్శకత్వం వహిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గజ’ Gaja. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డా. మైత్రి శరణ్ నిర్మిస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్పై తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ‘అల్లకల్లోలంగా’ లిరికల్ సాంగ్ను గురువారం హైదరాబాద్లో ఘనంగా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పాటను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సతీష్ జై ‘గజ’ చిత్రాన్ని పూర్తి చేశారని తెలిపారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుందని, ‘అల్లకల్లోలంగా’ పాటలో రామ్ మిర్యాల గానం, మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రశంసించారు. చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
హీరో, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ.. మణిశర్మ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ఎంతో బలంగా నిలిచిందని చెప్పారు. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు మంచి ఎమోషన్, ప్రేక్షకులను ఆలోచింపజేసే సందేశం సినిమాలో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించేలా ఉంటుందని పేర్కొన్నారు.
నిర్మాత డా. మైత్రి శరణ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్తో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘గజ’ కూడా అదే నమ్మకంతో రూపొందించామని అన్నారు.
మిట్టపల్లి సురేందర్ ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ‘గజ’ నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
