అక్కాచెల్లెళ్లపై ఆరు నెలల పాటు గ్యాంగ్ రేప్ చేసిన పది మంది !

తండ్రి లేక తల్లి పనులకి వెళ్తుంటే ఆమె ఇద్దరు కూతుళ్ళ మీద కన్నేసిన కామాంధులు వారి మీద అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలికలపై కన్నేసిన స్థానిక యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ మద్య అందులో ఒక బాలికకు ఆరోగ్యం బాగోక పోవడంతో ఏమైందని అడగ్గా స్థానికంగా ఉండే 10మంది యువకులు తమపై సాగిస్తున్న అఘాయిత్యాన్ని చెప్పుకుని బోరుమన్నారు. దీంతో పిల్లలను తనతో పాటు తీసుకెళ్లిన మహిళ పుదుచ్చేరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది.  అయితే బుధవారం రెండో తరగతి చదువుతున్న ఆమె చిన్న కూతురు కళ్లుతిరిగి పడిపోవడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు ఆమె అనేకసార్లు అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు. తొమ్మిదేళ్ల వయస్సున్న ఆమె అక్కని ఏం జరిగిందని అడగగా తనపైనా కొందరు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. దీంతో డాక్టర్లు పుదుచ్చేరి చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై విల్లుపురం పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి విల్లుపురం పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.