గట్టిగా అరుస్తున్న గౌతమ్ గంభీర్

గట్టిగా అరుస్తున్న గౌతమ్ గంభీర్

ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగనే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా అరుస్తూ తనదైన శైలిలో విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరపుకున్నాడు. తన సహాచరులను పంచ్‌ చేస్తూ సంబరాలు జరుపుకోవడం కనిపించింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఊతప్ప , శివమ్‌ దూబే , మొయిన్‌ అలీ  చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో డికాక్‌  కేఎల్‌ రాహుల్‌  లూయిస్‌ పరుగులతో రాణించారు.