మరో ఘోరం… నలుగురితో ఎఫైర్… అందరితో కలిసి భర్త హత్య

Goa Women killed husband with help of her friends

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇటీవలి కాలంలో ప్రేమించిన వాడి కోసం భర్తను హత్యలు చేయిస్తున్న భార్యల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. నీ ఈ ఘటన వాటన్నింటికీ మించింది. ఒకరు, ఇద్దరు కాదు. ఏకంగా నలుగురు ప్రియుళ్లతో కలసి తన భర్తను చంపించిందో యువతి. ఈ ఘటన గోవాలో జరుగగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోవా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇస్తూ, తాను ఓ హత్యను చూశానని చెప్పాడు. దాని ఆధారంగా పోలీసులు విచారణ జరుపగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక రాష్ట్రంలోని బైహోంగళ్ ప్రాంతానికి చెందిన కల్పన బారికి అనే 30 ఏళ్ల వివాహిత తన భర్త బసవరాజ్ బారికితో కలిసి గోవాలోని కుర్ చోరేం ప్రాంతంలో నివాసముంటోంది. భర్త బసవరాజ్ టాక్సీ డ్రైవరుగా పనిచేస్తూ 15రోజులకు ఓసారి ఇంటికి వచ్చి పోతుండే వాడు. దీంతో కల్పన రాజస్థాన్ కు చెందిన సురేష్ కుమార్, మార్మగోవాకు చెందిన పంకజ్ పవార్, కుర్చోరెమ్ కు చెందిన అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జార్ లతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది.

కల్పన వ్యవహారం భర్తకు తెలిసి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. తన నలుగురు ప్రియులను ఇంటికి పిలిచింది. భర్త బసవరాజ్ కాళ్లను గుజ్జార్ పట్టుకోగా తాళ్లతో కట్టి సురేష్ కుమార్, పంకజ్ పవార్, అబ్దుల్ షేక్ లు అతన్ని మూడు ముక్కలుగా కోశారు. మూడు ముక్కలు గన్నీ బ్యాగుల్లో సర్ది వేర్వేరు ప్రాంతాల్లో పడేయించింది కల్పన. అయితే బసవరాజ్ మిస్సింగ్ కేసు కూడా నమోదవకపోవడం వల్ల ఈ హత్య ఏప్రిల్ 1 నే జరిగినా ఇప్పటిదాకా పోలీసులు గుర్తించలేక పోయారు. అయితే తానొక హత్య చూశానని చెప్పడంతో మొత్తం హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఆదిత్య మినహా మిగతావారిని అరెస్ట్ చేశామని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వీరందరి పై ఐపీసీ 302, 201 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. నిందితురాలు కల్పన, ఆయన భర్తకు గోవాలో ఎవరూ బంధువులు లేరని, ప్రత్యక్ష సాక్షి నుంచి తమకు ఫిర్యాదు అందకుండా ఉంటే ఈ హత్య ఎప్పటికీ బయటపడి ఉండేది కాదని పోలీసులు తెలిపారు.