సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త

Good news for those who want to build their own home

కొత్త ఇంటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 10 రాష్ట్రాలకు 2.5 లక్షలకుపైగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.  గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశంలో ఇళ్ల మంజూరీకి ఆమోదం లభించిందని ఆయన ఈ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య 84 లక్షల సమీపంలోకి చేరిందని దుర్గా శంకర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు ఎక్కువగా 13 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. దీని తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదశ్ 12 లక్షలకుపైగా ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇక ఈ పీఎం అర్బన్ అవాస్ యోజన స్కీమ్ కింద నిర్దేశించుకున్న కోటీ ఇళ్ల నిర్మాణ లక్ష్యం 2020 చివరి కల్లా పూర్తయ్యే అవకాశముందని కేంద్రం భావిస్తోంది. అయితే నిర్దేశిత గడువు కన్నా రెండేళ్లు ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంటున్నారని చెబుతున్నారు. మోదీ 2015 జూన్‌లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్‌ను ఆవిష్కరించారు. 2022 కల్లా అందరికీ ఇల్లు అనే నినాదంతో ఈ స్కీం ప్రారంభించారు. ఈ స్కీం కింద ఇంటి నిర్మాణం కోసం తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు.