ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు శుభవార్త

సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కొత్త మోటారు వాహన చట్టం 2019 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. వీటిని చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలతో రోడ్లపైకి రావాలంటే వణికిపోతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే చాలు.. వేలు, లక్షల్లో చలాన్లు రాస్తున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

దీంతో ఈ కొత్త మోటారు వాహన చట్టంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఫైన్ల విషయంలో అలోచించి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం కూడా వాహనదారులకు ఈ జరిమానాలు విషయంలో రిలీఫ్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించే యోచనలో ప్రభుత్వం లేదని సమాచారం.

రాష్ట్ర రవాణ అధికారుల కమిటీ సూచించిన జరిమానాలు:

రోడ్డు నిబంధన అతిక్రమిస్తే రూ.250 , లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2500 , అర్హత లేకుండా వాహనం నడిపితే రూ.4000  ,ఓవర్ సైజ్డ్ వాహనాలు రూ.1000

కొత్త మోటారు వాహన చట్టం, జరిమానాలు గురించి తొలుత ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కార్ యోచిస్తోందట. అంతేకాకుండా ఈ భారీ ఫైన్లపై సమగ్ర అధ్యయనం జరిపి ఆమోదయోగ్యమైన జరిమానాలు సూచించాలని రవాణా అధికారులను జగన్ ఆదేశించారని సమాచారం.