మరో అందాల నటి బయోపిక్ లో కీర్తి సురేష్ దాదాపు ఖరారు.. !

అల‌నాటి అందాల న‌టి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన మ‌హాన‌టి సినిమాలో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీర్తి న‌ట‌న‌కి మంచి ప్రశంసలు అందుకుంది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన ఆమె అందరినీ మంత్ర ముగ్దులని చేసింది. ఓ మిస్మరైజ్ చేసేసిందనే చెప్పాలి. త‌న న‌ట‌న‌తో సావిత్రిని మ‌న క‌ళ్ల ముందు సాక్షాత్క‌రింప జేసిందనే చెప్పాలి. అయితే మ‌హాన‌టి చిత్రానికి గాను కీర్తి సురేష్ నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకుంది. కా మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కి బ‌యోపిక్ ప్రాజెక్ట్ ఆఫ‌ర్స్ ఎక్కువ‌గా వ‌స్తుండటం విశేషం.
అదేవిధంగా ఆ మ‌ధ్య ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవిత నేప‌థ్యంలో సింగీతం శ్రీనివాస‌రావు ఓ బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నారని టాక్ వినిపించింది. ఇందులో కీర్తిని ప్ర‌ధాన పాత్ర కోసం తీసుకుంటార‌నే ప్ర‌చారం కూడా ముమ్మరంగా జ‌రిగింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య.. దివంగత విజయ నిర్మల బయోపిక్ ను రూపొంద‌నున్న నేపథ్యంలో కీర్తి సురేష్‌ని టైటిల్ రోల్ కోసం ఎంపిక చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా విజ‌య నిర్మ‌ల కుమారుడు న‌రేష్ ఈ చిత్రాన్ని రూపొందించే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే సినిమాలో ప్ర‌ధాన పాత్ర కోసం కీర్తి సురేష్‌ని సంప్ర‌దించారని తెలుస్తోంది. కీర్తి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. కాగా న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌లో కీర్తి న‌టిస్తే ఆమె కెరీర్‌కి అదో గొప్ప అసెట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేష‌కులు భావిస్తున్నారు.