సినీ వర్గాల్లో మూడు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం

సినీ వర్గాల్లో మూడు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం

లేటెస్ట్ గా టాలీవుడ్ సినీ వర్గాల్లో మూడు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం చక్కర్లు కొడుతుంది.ఈరోజు టాలీవుడ్ ఫిలిం చాంబర్ లో మొత్తం మూడు టైటిల్స్ రిజిస్టర్ కాబడి అప్రూవ్ అయ్యాయని సమాచారం బయటకు వచ్చింది.అయితే వీటిలో రెండు పెద్ద సంస్థలు తెలిసినవే ఉండడం మూలాన ఆ చిత్రాలు ఏవో తెలుసుకోడానికి పెద్దగా ఎక్కువ సమయం ఎవరికీ పట్టలేదు.యూవీ క్రియేషన్స్ వారు “ఓ డియర్” మరియు “రాధే శ్యామ్” అనే టైటిల్స్ ను రిజిస్టర్ చెయ్యగా అవి కాస్తా అది ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రమే కాస్త అనుమానం గానే కన్ఫర్మ్ అయ్యిపోయింది.

అలాగే దానితో పాటుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు రిజిస్టర్ చేయించిన “వకీల్ సాబ్” తో సింపుల్ గా అర్ధం అయ్యిపోయింది.కానీ మూడో టైటిల్ రిజిస్టర్ చేయించిన సంస్థ పేరు కాస్త కొత్తగా ఉండే సరికి అది ఎవరు ఆ చిత్రం ఏమిటీ అన్న టాపిక్ ట్రెండ్ అయ్యింది.”ఆచార్య” పేరిట మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసారు.దీనితో అసలు ఈ చిత్రం ఎవరిదీ అన్న టాపిక్ వచ్చినపుడు మెగాస్టార్ 152 చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది అంటూ కొణిదెల ప్రొడక్షన్స్ వారు ఒక ఫోటోను విడుదల చెయ్యగా అందులో ఈ మాట్ని ఎంటర్టైన్మెంట్స్ పథాకం కనిపించింది.దీనితో ఈ చిత్రం మెగాస్టార్ ది అని నెటిజన్స్ ఒక కొలిక్కి వచ్చారు.