Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్బాబుకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా రెండు వరుస ఫ్లాప్లతో ఢీలా పడిపోయిన మహేష్బాబు ఈ సంవత్సరంలో ‘భరత్ అనే నేను’ చిత్రంతో రికార్డు బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డు ఖాయం అని తేలిపోయింది. సునాయాసంగా 125 కోట్లను వసూళ్లు చేసిన భరత్ అనే నేను చిత్రం తర్వాత మహేష్ బాబు తన 25వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సంవత్సరం తనకు కలిసి వచ్చింది కనుక తన 25వ చిత్రాన్ని కూడా ఇదే సంవత్సరంలో విడుదల చేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని మహేష్బాబు భావిస్తున్నాడు.
మహేష్బాబు 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు మరియు అశ్వినీదత్లు నిర్మిస్తున్నారు. ఒక స్టార్ హీరో 25వ చిత్రం అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక అది మహేష్బాబు 25వ చిత్రం అయితే అంచనాలు ఆకాశాన్ని సైతం క్రాస్ చేసేలా ఉంటుంది. అందుకే తగ్గట్లుగా ఒక మంచి సబ్జెక్ట్తో సినిమాను సిద్దం చేస్తున్నాడు. రికార్డు స్థాయిలో బడ్జెట్ను పెట్టేందుకు నిర్మాతలు ఇప్పటికే సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను వచ్చే నెలలో మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ వెంటనే సినిమా టైటిల్ను ప్రకటించనున్నారు. దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అది సాధ్యం కానట్లయితే కనీసం క్రిస్మస్కు అయినా విడుదల చేయాలని నిర్మాతలతో మహేష్బాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డేను ఎంపిక చేయడం జరిగింది.