కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై దాడులు చేసిన ఐటీ అధికారులు తాజాగా హీరో విజయ్‌ని టార్గెట్ చేశారు. అయితే ఈయనతో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అయితే ఇటీవల విజయ్ హీరోగా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బిగిల్ సినిమా నిర్మించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ సుమారు 120 కోట్ల రూపాయలుగా తేలిందని కానీ సినిమా నిర్వాహకులు మాత్రం పెద్ద మొత్తంలో ఆదాయపు పన్నులను లెక్క చూపలేదని, సినిమా నిర్మాణ వ్యయం గురుంచి కూడా సరైన సమాచారాన్ని ఇవ్వలేదని అందుకే ఐటీ అధికారులు దాడులు చేసినట్టు సమాచారం. అయితే కడలూరులో మాస్టర్ చిత్రం చిత్రీకరణలో ఉన్న విజయ్‌ను ఐటీ అధికారులు తీసుకెళ్ళి విచారిస్తున్నారు.