బాబుకు జగన్, మోడీల శుభాకాంక్షలు !

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ట్విట్టర్ వేదికకు చంద్రబాబుకు ఆయన విషెస్ తెలిపారు. ‘వార్మ్ బర్తడే గ్రీటింగ్స్ టు ఎన్సీబీఎన్ గారు’ అని జగన్ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వదులునకున్న అధికార ప్రతిపక్ష నేతలు ఇలా విష్ చేసుకోవడం పట్ల జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోవీ కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రబాబు తన బర్త్‌డే రోజున కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఆయన 70వ వడిలోకి అడుగు పెడుతున్నారు. ట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 10: 30 గంటల వరకు ఉండవల్లిలోని తన నివాసంలో అభిమానులు, పార్టీ నేతలతో గడుపుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు.