ఉత్తరాంధ్రలో టఫ్ ఫైట్ లో ఎవరి గెలుపు ఎక్కడో తెలుసా ?

తెలుగు బులెట్ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన విశ్లేషణకు అపారమైన ప్రతిస్పందన కనిపించింది. అయితే పోటాపోటీ అనుకున్న స్థానాల్లో ఎవరు ఎక్కడ గెలిచే అవకాశం ఉందన్న సందేహాలు తీరలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సందేహాలు తీర్చడానికి ఉత్తరాంధ్రలో పోటాపోటీ అనుకున్న చోట ఎవరు గెలిచే అవకాశం వుందో చెబుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని మూడు స్థానాల్లో పోటాపోటీ ఉందని అందులో రెండు చోట్ల టీడీపీ , ఒక్క స్థానంలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పాము. ఆ స్థానాలు ఏమిటో ఇప్పుడు వివరిస్తున్నాం. ఇచ్చాపురం , ఆముదాలవలస , పాలకొండ స్థానాల్లో పోటీ గట్టిగా వుంది. ఇచ్చాపురం , ఆముదాలవలసలో స్వల్ప ఆధిక్యంతో టీడీపీ ఇక పాలకొండలో వైసీపీ గట్టెక్కే ఛాన్స్ వుంది. ఇక విజయనగరం జిల్లాలో కురుపాం, సాలూరు ,నెల్లిమర్ల లో గట్టి పోటీ నెలకొంది.  కురుపాం , సాలూరు లో వైసీపీ అభ్యర్థులు అతి కష్టం మీద గెలుపు తీరాన్ని చేరే అవకాశం వుంది. నెల్లిమర్ల లో టీడీపీ గెలుపు కి అవకాశం మెండుగా వుంది. విశాఖ జిల్లా విషయానికి వచ్చేసరికి విశాఖ సౌత్ , భీమిలి , అనకాపల్లి ,పెందుర్తి , నర్సీపట్నం స్థానాల్లో తీవ్రమైన పోటీ వుంది. ఇందులో విశాఖ సౌత్ , పెందుర్తి , అనకాపల్లి లో వైసీపీ , భీమిలి , నర్సీపట్నం లో స్వల్ప మెజారిటీ తో టీడీపీ గెలిచే ఛాన్స్ వుంది.