అసెంబ్లీ లో చంద్రబాబు ఫై విరుచుకుపడ్డ జగన్

అసెంబ్లీ లో చంద్రబాబు ఫై విరుచుకుపడ్డ జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో చంద్రబాబు ఫై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యే లు సభని బఫున్లలా అడ్డుకుంటున్నారని అనడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఈ వ్యాఖ్యల ఫై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే గడిచిన శుక్రవారం కూడా టీడీపీ జగన్ ఫై ప్రివిలైజ్ మోషన్ ఇచ్చింది. స్పీకర్ ని కలిసిన టీడీపీ నేతలు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. మార్షల్స్ ని అనని మాటలు అన్నమని వక్రీకరించి ఆరోపణలు చేసారని తెలిపారు.

స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్ నుండి ఎలాంటి స్పందన లేదు. నిన్న జరిగిన సమావేశం లో ఎస్సి, ఎస్టీ కమిషన్ ఏర్పాటు గురించి చర్చ జరుగుతుండగా సభలో టీడీపీ ఎమ్మెల్యే లు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ ఎమ్మెల్యే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.