ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రకటించిన మాన్సూన్ హంగామా ఆఫర్ నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఒక్క రోజు ముందుగానే మాన్సూన్ ‘హంగామా’ ఆఫర్ ను రిలయన్స్ జియో లాంచ్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద కేవలం 501 రూపాయలకే జియోఫోన్ను కస్టమర్లకు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షికోత్సవ సమావేశంలో రిలయన్స్ జియో ఈ ఆఫర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 21 నుంచి ఈ స్కీమ్ను ప్రారంభిస్తామని తెలిపింది. అయితే ఒక్క రోజు ముందుగానే అంటే నేటి నుంచే ఈ స్కీమ్ను రిలయన్స్ ప్రారంభిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ కొత్త జియోఫోన్ రిజిస్ట్రేషన్లను సైతం కంపెనీ తన అధికారి వెబ్సైట్లో ప్రారంభించింది.
మాన్సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్ వివరాలు
1. మాన్సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్లో భాగంగా రూ.501 చెల్లించడం ద్వారా జియోఫోన్ సొంతం చేసుకోవచ్చు.
2. దీంతోపాటుగా, రూ.501ని తిరిగి చెల్లించే సెక్యురిటీ డిపాజిట్గా పేర్కొనడం వల్ల మూడేళ్ల తర్వాత వినియోగదారులు ఈ మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు. అంటే…జియోఫోన్ మీకు ఉచితంగా వస్తున్నట్లే.
3. ఏదైనా 2జీ, 3జీ, 4జీ ఫోన్ (VOLTE కానిది) అందించి రూ. 501 చెల్లించడం ద్వారా ఏ రిటైల్ కేంద్రంలో అయినా వెంటనే జియో ఫోన్ను మీ సొంతం చేసుకోవచ్చు.
4. వినియోగదారులు గమనించాల్సిన అంశం ఏమిటంటే…ఎక్సేంజ్ చేస్తున్న ఫోన్ పనిచేసే స్థితిలో ఉండాలి మరియు చార్జర్ కలిగి ఉండాలి.
5. కొత్త జియో ఫోన్ కొనుగోలు చేస్తున్న సందర్భంగా పాత ఫోన్ను రిటైలర్కు ఇచ్చేయాల్సి ఉంటుంది.
జియో సిమ్
1. వినియోగదారులు జియో ఫోన్తో జియో సిమ్ పొందవచ్చు.
2. ఒకవేళ ప్రస్తుతం తాము వాడుతున్న మొబైల్ నంబరును కోల్పోవడం వినియోగదారులకు ఇష్టం లేకపోతే…మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్పీ) ద్వారా అదే నంబరు పొందవచ్చు. జియోకు ఎంఎన్పీ ఒక్కసారి పూర్తయితే ఆ వినియోగదారుడు మాన్సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్ను ఎంచుకోవచ్చు.
స్పెషల్ రీచార్జ్ ప్లాన్
1. వినియోగదారులకు లబ్ధి చేకూర్చడం అనే తన ప్రదానమైన ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్సూన్ హంగామా కింద జియో ప్రత్యేకమైన జియో ఫోన్ రీచార్జ్ ప్లాన్ను ప్రవేశపెడుతోంది.
2. ఈ పథకంలో భాగంగా వినియోగదారులు యాక్టివేషన్ సమయంలో రూ. 594 చెల్లించడం ద్వారా 6 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్ మరియు డాటాను పొందవచ్చు.
3. దీంతోపాటుగా జియో ఫోన్ వినియోగదారులు మాన్సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్తో పాటుగా రూ.101 ఓచర్తో 6 జీబీ డాటా స్పెషల్ ఎక్సేంజ్ బోనస్ను సొంతం చేసుకోవచ్చు.
4. తద్వారా 6 నెలల్లో మొత్తం డాటా 90 జీబీలకు చేరుతుంది.
5. మూన్ సూన్ హంగామా ద్వారా జియోఫోన్ను రూ.501లో పొందడం మరియు రూ.594 రీచార్జీ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ మరియు డాటాను వినియోగదారులు పొందవచ్చు.
మీ పాత ఫోన్ ఎక్సేంజ్కు అర్హత కలిగి ఉందా?
ఎక్సేంజ్ పద్దతిలో అందించి జియో ఫోన్ పొందేందుకు మీ పాత ఫోన్ ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలిః
1. మొబైల్ ఫోన్ ప్రస్తుతం పనిచేస్తున్న స్థితిలో ఉండాలి. ( ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తున్న స్థితిలో ఉండి డ్యామేజ్ అవడం కానీ లేదా ఏవైనా ఉపకరణాలు దెబ్బతిని ఉండటం కానీ కాలిపోవడం కాని జరిగి ఉండవద్దు).
2. గత మూడున్నరేళ్ల కాలంలో అమ్మబడినవి (అంటే 2015 జనవరి 1వ తేదీ తర్వాత ) #మాత్రమే ఎక్సేంజ్కు అర్హత కలిగినవి.
3.2జీ, 3జీ, 4జీ ఫోన్లలో ఏదైనా VOLTE కానివి ఎక్సేంజ్కు అర్హత కలిగినవి.
4. జియో ఫోన్ లేదా సీడీఎంఏ లేదా ఆపరేటర్ లాక్ వేసిన ఫోన్లు ఎక్సేంజ్లో తీసుకోబడవు
5. బ్యాటరీ మరియు చార్జర్ కాకుండా హెడ్ఫోన్స్ వంటి ఇతర ఉపకరణాలు ఏవి ఎక్సేంజ్కు అవసరం లేదు.
మీ పాత ఫీచర్ ఫోన్ ఎక్సేంజ్ చేసేందుకు వెళుతున్నపుడు మీ వెంట ఏం తీసుకువెళ్లాలంటే…
1. ప్రస్తుతం పనిచేస్తున్న స్థితిలో ఉన్న మీ మొబైల్ ఫోన్.
2. పాత ఫోన్కు సంబంధించిన బ్యాటరీ మరియు చార్జర్
3. ఆధార్ నంబరు
4. మొబైల్ నంబరు పోర్టబిలిటీ వాడుకుంటే మీ కొత్త జియో ఎంఎన్పీ నంబరును తీసుకువెళ్లాలి.