జియో మరో సంచలనం…మూడు వేలకే ఫీచర్ ఫోన్ !

జియో సంచలనాలు కొనసాగుతున్నాయి. మాన్ సూన్ హంగామా’ పేరిట ఓ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు ముఖేష్ అంబానీ. జియో ఫోన్ ను వాడుతున్న వారు, ఆ ఫోన్ ను తిరిగి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవచ్చని తెలిపారు. జూలై 21 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఫోన్ తో పాటు రూ. 501 చెల్లించాలని చెప్పారు. జియో ఫీచర్ ఫోన్ ధరను రూ. 1,500 నుంచి రూ. 501కి తగ్గిస్తున్నట్టు చెప్పారు. ‘జియో ఫోన్ 2’ ను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెస్తామని, దీని ధర రూ. 2,999గా ఉంటుందని అన్నారు. ఆపరేటింగ్ kaios, 512MB RAM, 4GB RAM, 128GB కు స్టోరేజ్ పెంచుకోవచ్చు, 2.4 QVGA డిస్ ప్లే, 2 మెగా ఫిక్సల్ రేర్ కెమెరా, VGA ఫ్రంట్ ఫేస్ కెమెరా, డ్యూయల్ సిమ్, ఒకటి 4Gలో పనిచేస్తోంది. మరొకటి VOLTEలో వర్క్ చేస్తోంది. వై-ఫై కనెక్టివిటీ ఉంది, FM, బ్లూటూత్, GPS, NFC ప్యూచర్స్ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ కొత్త ఆఫర్ల గురించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ప్రస్తుతం జియో గిగా ఫైబర్ ట్రయల్స్ నడుస్తున్నాయని, ఆగస్టు 15 నుంచి ‘మై జియో’, ‘జియో డాట్ కామ్’లో రిజిస్టర్ చేసుకున్న వారికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దగ్గర చేస్తామని అన్నారు. అత్యధిక రిజిస్ట్రేషన్లు వచ్చిన ప్రాంతానికి తొలి సేవలు అందుతాయని వెల్లడించారు.