ఎన్టీఆర్ తో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన త్రివిక్రమ్

ఎన్టీఆర్ తో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన త్రివిక్రమ్

అలా వైకుంఠ పురంలో చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటుగా మరొక యంగ్ హీరో కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి చిత్రంలో యంగ్ హీరో ఆది పినిశెట్టి నీ విలన్ రోల్ లో పెట్టారు. అలానే అరవింద సమేత వీర రాఘవ లో కూడా నవీన్ చంద్ర కు అవకాశం కల్పించారు. అలా వైకుంఠ పురంలో చిత్రంలో కూడా సుశాంత్ ను తీసుకున్నారు. అయితే ప్రతి సినిమా లో త్రివిక్రమ్ ఈ ట్రెండ్ ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో త్రివిక్రమ్ బిజీ గా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో కూడా ఒక యువ హీరో ను తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ అవకాశం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరికి ఇస్తారో చూడాలి. అయితే ఈ చిత్రానికి అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రౌద్రం రణం రుధి రం చిత్రంలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ చిత్రం పూర్తి అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా లో పాల్గొననున్నారు.