నర్సరావుపేట కోర్టులో లొంగిపోయిన కోడెల తనయుడు

నర్సరావుపేట కోర్టులో లొంగిపోయిన కోడెల తనయుడు

మాజీ స్పీకర్..దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన అనేక అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. వీటి మీద తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివరాం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే..ఈ కేసుల విషయంలో స్థానిక కోర్టును ఆశ్రయించాలని..అక్కడ బెయిల్ కు అభ్యర్ధన చేయాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు శివరాం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఆరు కేసుల్లో బెయిల్ లభించింది.

ఇక, కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య కేసులో విచారణ కోసం హాజరు కావాల్సిందాగా ఆయన పిల్లలిద్దరికీ పోలీసులు సమాచారం ఇచ్చారు. 11వ రోజు కార్యక్రమం ముగిసిన తరువాత తాము వస్తామని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యవహారంలోనూ శివరాం హైదారబాద్ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది.

ఆయన మీద అనేక కేసులు పెండింగ్ లో ఉన్నారు. కే టాక్స్ పేరుతో ఉద్యోగాలు..కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ అనేక మంది వద్ద ఆయన డబ్బులు వసూలు చేసి మోసం చేసారని అనేక కేసులు నమోదయ్యాయి. దీని పైన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కోడెల సంతానం హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన కోర్టు సైతం స్పష్టమైన సూచనలు చేసింది. కేసులు నమోదైన జ్యూరిస్డిక్షన్ కోర్టుకు హాజరై..అక్కడే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

దీంతో..కోడెల మరణానికి మందు కెన్యా వెళ్లిపోయిన శివరాం..తండ్రి మరణం తో తిరిగి వచ్చారు. ఇప్పుడు తండ్రి 11వ రోజు కార్యక్రమాలు కూడా ముగియటంతో ఆయన ఈ రోజు నర్సరావు పేట కోర్టులో హాజరయ్యారు. ఆయన మీద నమోదైన వాటిల్లో ఆరు కేసుల్లో శివరాంకు బెయిల్ లభించింది. కేసుల్లో విచారణ కొనసాగనుంది. దీని ద్వారా మిగిలిన కేసుల విషయంలోనూ న్యాయ పరంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.