మెగాస్టార్ తీస్కున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయిన హీరో

మెగాస్టార్ తీస్కున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయిన హీరో

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరానరసింహారెడ్డి’ ప్రేక్షకులముందు వచ్చిన నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమా ఏంఅనే దానిపై అభిమానులకి ఆసక్తి పెరిగింది.కొరటాలశివ దర్శకత్వంలో ఇంతకుముందే సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మలయాళంలో విజయంసాధించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లు గడించిన‘లూసిఫర్‌’సినిమా రీమేక్‌ హక్కులను చిరంజీవి కొన్నారని హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ చేసిన ట్వీట్ ద్వారా తెలిసింది.

‘సైరానరసింహారెడ్డి’ప్రమోషన్‌ కొరకి కేరళలో పర్యటించిన మెగాస్టార్ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటన అంటే ఇష్టమని, సైరాలో నటించమని కోరినట్టు వెల్లడించారు.

చిరంజీవిగారితో కలిసి సైరా ప్రచారంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. మానవత్వం, మంచితనం కలిగిన మనిషి.లూసిఫర్‌ సినిమా రీమేక్‌ హక్కులు కొనుగోలు చేయడం ఆశ్చర్యం.నటించేందుకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు,‘సైరానరసింహారెడ్డి’లో నటించలేక పోయినందుకు క్షమించండి అంటూ ఈ మలయాళీ హీరో ట్వీట్‌ చేశారు.