మళ్ళీ భరిలోకి పేస్‌

టెన్నిస్‌

పాక్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌కు ఆడుతానని 46 ఏళ్ల లియాండర్‌ పేస్‌ ప్రకటించారు. ఐటీఎఫ్‌-అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య కి ఏఐటీఏ జనరల్‌ సెక్రటరీ హిరణ్మయ్‌ చటర్జీ ఆటగాళ్లకు వీసాలకి సంబందించిన పత్రాలను పంపించమని తెలిపింది. పోటీలో పాల్గొనేందుకు ఆటగాళ్లు నిరాకరించడం తో లియాండర్‌ పేస్‌ ముందుకు వచ్చాడు. మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు.

నవంబర్‌ 29, 30వ తేదీల్లో డేవిస్‌ కప్‌ ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ జరుగనుంది. డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్1 లో ఆడేందుకు భారత టెన్నిస్‌ ప్రముఖ క్రీడాకారులు నిరాకరించడం తో లియాండర్‌ పేస్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. భద్రతా కారణాల వల్ల పలువురు ఆటగాళ్లు విముఖత చూపారు. లియాండర్‌ పేస్‌ మ్యాచ్‌ ఆడతానని ఏఐటీఏ-అఖిల భారత టెన్నిస్‌ సంఘంకి తెలియచేశాడు.