మహేష్‌ నోట మల్టీస్టారర్‌ మాట

Mahesh Babu Ready to Do Multistarrer Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులకు స్టార్‌ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చూపించాడు. వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని చేసి ప్రేక్షకుల ప్రశంసలు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత కూడా మళ్లీ మల్టీస్టారర్‌ చిత్రాలు చేసేందుకు తనకు ఆసక్తిగా ఉంది అంటూ మహేష్‌ మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నాడు. తాజాగా దిల్‌రాజు ఇంట్లో ఒక వేడుకలో మహేష్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఒక ఆసక్తికర సన్నివేశం అక్కడ జరిగింది.

mahesh-babu

దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు హరిష్‌ శంకర్‌లు కలిసి మహేష్‌బాబుతో మల్టీస్టారర్‌ సినిమాలు చేసేందుకు మీరు సిద్దమేనా అంటూ ప్రశ్నించారు. మంచి కథతో వస్తే మల్టీస్టారర్‌ చిత్రాలు చేసేందుకు సిద్దం అంటూ చెప్పుకొచ్చాడు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌లతో కలిసి నటించేందుకు మీకు ఏమైనా ఇబ్బందా అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రశ్నించిన సందర్బంగా మహేష్‌బాబు మరోసారి స్పందిస్తూ మంచి కథతో వస్తే ఎవరితో అయినా నటించేందుకు తాను సిద్దమే అని, మంచి కథతో పాటు, తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటే ఖచ్చితంగా వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు చేయమన్నా కూడా తాను సిద్దమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేష్‌బాబు కోసం కథను సిద్దం చేస్తున్నాడు. వచ్చే సంవత్సరంలో సినిమా ప్రారంభం కాబోతుంది.

mahesh

వంశీ పైడిపల్లి మరియు హరీష్‌ శంకర్‌లు అంతగా అడిగారు కనుక ఖచ్చితంగా వీరిద్దరిలో ఎవరో ఒకరు మహేష్‌బాబుతో మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. మరోసారి మహేష్‌బాబు మల్టీస్టారర్‌ చేస్తే ప్రేక్షకులకు మరియు ఫ్యాన్స్‌కు పండగే.