ప్రియురాలి కోసం భర్త హత్య…కానీ !

murder-ys

ప్రియురాలిని ఏకాంతంగా కలుసుకునేందుకు అడ్డుగా ఉన్నాడని, ఆమె భర్తను చంపించాడో ప్రభుద్దుడు. కలకలం రేపుతున్న ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలోని జహీరాబాద్ సమీపంలో వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల మహ్మద్ ముబీన్‌కు అదే ఏరియాలో ఉంటున్న సయ్యద్ కరీం అనే యువకుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అప్పటి నుండే వీరు ప్రేమాయణం నడిపే వారు. అయితే ఆమె భర్త సయ్యద్ కరీం బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లడంతో తల్లి గారింటికి వచ్చిన ఆమెను తరుచూ కలుస్తూ ఉండేవాడు ముబీన్. భర్త దూరంగా ఉండడంతో ప్రియురాలు మళ్లీ తన దగ్గరికి వచ్చేస్తుందనే నమ్మకం అతనికి కలిగింది. అయితే ఆరు నెలల క్రితం కరీం గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చాడు. భార్యతో కలిసి జహీరాబాద్ టౌన్‌లో ఓ షాపు పెట్టుకుని బతుకుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రియురాలిని కలుసుకోవడం ముబీన్‌కు చాలా కష్టంగా మారింది. భర్త నిర్వహించే షాపుకీ, ఇంటికీ పెద్ద దూరం లేకపోవడంతో ఆమెను ఎలా కలుసుకోవాలో తెలియక ముబీన్ బాధ పడేవాడు. తన ప్రియురాలిని కలుసుకునేందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్తను చంపేయాలని ఫిక్స్ అయిన ముబీన్ తాను చంపితే ప్రియురాలు తనకు శాశ్వతంగా దూరమవుతుందనే భయంతో ఒక కిరాయి రౌడీని ఆశ్రయించాడు. స్కూల్ బ్యాగులు కుట్టుకునే వ్యాపారం చేసి, అప్పుల పాలైన సమద్ కరీం ఇస్తానన్న రూ.3 లక్షల కోసం ఆశపడి కరీంను చంపేందుకు ప్లాన్ చేశాడు. అనుకున్న ప్రకారమే కొబ్బరి బొండాలు నరికే కత్తితో కరీం దుకాణానికి వెళ్లిన సమద్ అతన్ని మెడ మీద నరికి చంపాడు. కరీం చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముబీన్, సమద్‌లు ఇద్దరూ కలిసి మైటార్ సైకిల్‌పై పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాక్ష్యాలను బట్టి రెండు రోజుల్లోనే వారిని అరెస్ట్ చేశారు.