టిఫిన్ తినేందుకు రైలాపిన ప్రభుద్దుడు

man stops train to eat tiffin

టిఫిన్ తినేందుకు ఓ ప్రయాణికుడు ఏకంగా రైలు చైన్‌నే లాగి రైల్వే అధికారులకు చిక్కాడు. ఈ ఘటన న్యూఢిల్లీ – భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. ఈస్ట్ ఢిల్లీకి చెందిన మనీష్ అరోరా అనే వ్యక్తి తన తల్లితో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు. మధురా జంక్షన్‌కు రాగానే టిఫిన్ తినేందుకు తల్లితోపాటు ప్లాట్‌ఫాం మీదకు దిగాడు. అయితే రైలు కదిలే సమయానికి అతడి తల్లి ఇంకా టిఫిన్ పూర్తిగా తినలేదు. దీంతో రైలెక్కిన మనీష్ చైను లాగాడు. తల్లి టిఫిన్ తిన్న తర్వాత రైలెక్కిన మనీష్‌ ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. అనధికారికంగా రైలుకు అంతరాయం కలిగించాడనే కారణంతో రైల్వే సెక్షన్ 141 కింద కేసు బుక్ చేశారు. రైల్వే మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యేందుకు మనీష్‌కు తేదీ నిర్ధారించారు. రైలు చైన్ లాగినందుకు మనీష్ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, లేకపోతే జైలు శిక్ష తప్పదని మధురా స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆర్పీఎఫ్ సీబీ ప్రసాద్ తెలిపారు.