200 కోట్ల మార్క్ క్రాస్ చేసిన క‌బీర్ సింగ్

kabir singh crossed two hundred crores mark

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌గా బాలీవుడ్‌లో క‌బీర్ సింగ్ అనే చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. జూన్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చూపిస్తుంది. కేవ‌లం ఇండియాలోనే ఈ చిత్రం 200 కోట్ల మార్క్ రాబ‌ట్టింది. ఇప్ప‌టికీ ఈ చిత్రం థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ క్ర‌మంలో క‌బీర్ సింగ్ ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే. షాహిద్ క‌పూర్ కెరియర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన చిత్రంగా క‌బీర్ సింగ్ నిలవడం విశేషం.