మెక్సికోలో కాల్పులు… 24మంది మృతి

Home Crime Murder Of A Politician

మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. పలువురు దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే ఈ మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఘటనా స్థలం అతి భయంకరంగా మారిపోయింది. కాగా కాల్పుల ఘటన వెనుక డ్రగ్స్‌ ముఠాల హస్తం ఉండ వచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నెల రోజులుగా నగరంలో ఇది రెండవ ఘటన అని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. కాల్పుల్లో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికో అధ్యక్షుడిగా ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 19 నెలల క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో ఇలాంటి దాడుల సంఖ్య కాస్త తగ్గింది. కానీ.. ఇప్పుడు మరోసారి వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల ఘటన 2020లో ఏడాదిలో జరిగిన అతి పెద్ద నరమేధంగా అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.