మంత్రి ఎర్రబెల్లికి ప్రమాదం

మంత్రి ఎర్రబెల్లికి ప్రమాదం

తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌ను వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

యాదాద్రి కలెక్టరేట్ సమీపంలో మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లోని కారును వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి గాయాల‍య్యాయి. గాయపడిన వారిని మంత్రి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆస్పత్రికి తరలించారు. గతంలో​ ఎర్రబెల్లి దయాకర్‌ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.