మైనర్‌ బాలికపై అఘాయిత్యం

మైనర్‌ బాలికపై అఘాయిత్యం

ఓ ఆటో డ్రైవర్‌ మైనర్‌ బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన గౌడవెళ్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట్‌ ప్రాంతానికి చెందిన వెంకటేష్, గౌడవెళ్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళ ఇంటి సమీపంలో ఉంటున్న బాలికతో అతడికి ఏర్పడింది. మార్చి 31న ఆటోలో గౌడవెళ్లికి వచ్చిన వెంకటేష్‌ స్కూల్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఏప్రిల్‌ 1న బాధితురాలి స్నేహితురాళ్లు సదరు బా లిక ఒక్కతే ఆటోలో వెళ్లిన విషయం క్లాస్‌ టీచర్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీచర్‌ బాధితురాలిని పిలిచి ఆరా తీయగా వెంకటేష్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చె ప్పింది. దీంతో టీచర్‌ బాధితురాలి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది..అయితే వారు పరువు ఎక్కడ పోతుందనే కారణంతో ఫిర్యాదు చేయలేదు. సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలిక ద్వారా విష యం తెలుసుకున్న టీచర్‌ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో వారు సోమవారం సాయంత్రం మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.