కారులో మహిళపై అత్యాచారం

కారులో మహిళపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మహిళపై కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడి బాధిత మహిళను  ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.