భర్తపై కోపంతో 3 నెలల పాపను చెత్త బుట్టలో పడేసిన తల్లి..

భర్తపై కోపంతో 3 నెలల పాపను చెత్త బుట్టలో పడేసిన తల్లి..
Andhrapradesh , Crime

బిడ్డ పుట్టడంతో అంకమ్మ ఆంజినేయులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే వీరిద్దరికి మరో సారి గొడవ జరిగింది. దీంతో ఆమె తన కూతుర్ని మార్కెట్ సమీపంలోని ఒక చెత్త బుట్టలో వదిలేసి వెళ్లిపోయింది. ఆ రాత్రి ఏడు గంటల సమయంలో బిడ్డ చెత్త కుప్పలో ఉండడం పారిశుద్ద్య కార్మికులు చూసారు . వెంటనే స్పందించిన కార్మికులు.. స్థానిక పోలీసుకు ఈ విషయాన్ని తెలియచేసారు . బిడ్డను రక్షించారు .

భర్తపై కోపంతో 3 నెలల పాపను చెత్త బుట్టలో పడేసిన తల్లి..
Garbage

జన్మనిచ్చిన తల్లిలోనే కన్న ప్రేమ, మానవత్వం మంట కలిశాయి. నెలల వయసే ఉన్న కన్న కూతుర్ని ఆ తల్లి చెత్త కుప్ప పాలు చేసేసింది . భర్త త్రాగుడుకి బానిసై వేధించడంతో అతని మీద కోపాన్ని కూతురిపై చూపించింది . అయితే విషయం తెలుసుకున్న పోలీసులు బిడ్డను రక్షించడంతో పాటు వెంటనే ఆ తల్లిపై కేసు నమోదు చేశారు. బాపట్లలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బాపట్లకు చెందిన అంకమ్మ, ఆంజినేయులు దంపతులు చెత్త వేరుకుంటూ జీవనం సాగిస్తున్నారు . కొద్దీ నెలల కిందట అంకమ్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అంతక ముందు నుండే భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి . త్రాగి వచ్చిన ఆంజినేయులు తరచూ భార్యను అంకమ్మ వేధించేవాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపాయి. ఈ కారణంతోనే ఇద్దరూ కొన్ని రోజుల నుండి దూరంగా కూడా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే అంకమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ప్రస్తుతం మూడో నెల వచ్చింది. . బిడ్డను రక్షించి ఐసిడిఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. మూడు నెలల ఆడ బిడ్డ ప్రస్తుతానికి క్షేమంగా ఉంది.