ఈఅరి గుంటూరులో వెంటాడి వేటాడి నరికేసారు !

Man arrest

మిర్యాలగూడ, ఎర్రగడ్డ, అత్తాపూర్ లలో కత్తుల స్వైర ఇహారం మరువక ముందే ఈ సెగ ఏపీకి కూడా అంటుకుంది. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అందుతున్న సమాచరం మేరకు గుంటూరు జిల్లా మాచర్లలో పట్టపగలే ఓ వ్యక్తిని కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపారు ప్రత్యర్ధులు. బాధితుడు ప్రాణ భయంతో పరుగు తీయగా అతణ్ని వెంబడించి, వేటాడి హతమార్చారు. నడిరోడ్డుపై కత్తులతో వేటాడి వ్యక్తిని నరికి చంపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది.

Man arrest

పోలీసుల వివరాల ప్రకారం మాచర్ల తాలూకా చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల బయటికి వచ్చాడు. ప్రేమ్ కుమార్ భార్య వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈరోజు మధ్యాహం ప్రేమ్ కుమార్ తన భార్యను కలిసేందుకు బుల్లెట్ మీద బయలుదేరాడు. మార్గమధ్యంలో కారులో కొంత మంది అతణ్ని వెంబడించారు. తనను వెంబడించడం గమనించిన ప్రేమ్ కుమార్ బైక్ స్పీడు పెంచాడు.

Murder In guntur

అయితే కారులో వాళ్లు వేగంగా వేటాడుతుడూ వస్తుండటంతో ఓ చోట బైక్‌ను రోడ్డుపై వదిలేసి పరుగు అందుకున్నాడు. సమీపంలో కొంత మంది ఉండటాన్ని గమనించి కాపాడుతారనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రేమ్ కుమార్‌ను వేటాడిన దుండగులు అతణ్ని పట్టుకొని కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. తీవ్ర గాయాల పాలైన ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్ కుమార్‌ను వెంటాడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.