ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు

ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అధికారం లో ఉన్నపుడు ప్రతిపక్ష పార్టీ నేతల్ని సంతల్లో పశువుల్లా కొన్నాడు అని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే ఇపుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ లకు డబ్బు ముట్ట చెబుతున్నాడు, ఎమ్మెల్సీ లు ఎక్కడ దిక్కరిస్తారో అని నిద్రపోవడం లేదు అంటూ దారుణ విమర్శలు చేసారు. ఎమ్మెల్సీ ల పదవీకాలం ముగిసేంత వరకు జీతభత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

శాసన మండలి రద్దు కాకుండా ఉంటే ఎమ్మెల్సీ లు వైసీపీ లోకి వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ లోని ఎమ్మెల్సీ ల తో టచ్ లో కొందరు వైసీపీ నేతలు ఉన్నారని వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి. జగన్ కూడా నన్ను చంద్రబాబు లా మార్చవద్దు అంటూ, శాసన మండలి రద్దుకే మొగ్గు చూపినట్టు సమాచారం. ఈరోజు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశం లో ముఖ్యమంత్రి జగన్ శాసన మండలి రద్దు పట్ల కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.