ఈ చైతన్యవంతమైన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు: మోదీ

Political Updates: 'Don't compare India with China'.. PM Modi made harsh comments
Political Updates: 'Don't compare India with China'.. PM Modi made harsh comments

ఏపీ ప్రజల శ్రేయస్సు, విజయం కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంగా, ఈ చైతన్యవంతమైన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు.

వారి అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారని తెలిపారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం నేను ప్రార్ధిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక ఇందులో భాగంగా… ఇవాళ ఉదయం 10 :16 గంటలకు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కంచారు సీఎం జగన్. ఈ సందర్భంగా తెలుగు తల్లికి అలాగే అమరాజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.