న్యూస్‌ ట్యాబ్‌ ఇన్ ఫేస్‌బుక్‌

న్యూస్‌ ట్యాబ్‌ ఇన్ ఫేస్‌బుక్‌

అమెరికాలోని కొన్నిరాష్ట్రాల్లో “న్యూస్‌ట్యాబ్‌“తో కూడిన కొత్త అప్‌డేట్‌ ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ శుక్రవారం తెలిపారు. ఫేస్‌బుక్‌లో ‘న్యూస్‌ ట్యాబ్‌’తో కూడిన కొత్త అప్‌డేట్‌ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది.న్యూస్‌ట్యాబ్‌లో వినియోగదారులు తమఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్‌బుక్‌లో వస్తున్న అసత్య వార్తల రీత్యా పలు చోట్ల నిరసనలు, ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు వెళ్లాయి.

ఫేస్‌బుక్‌ ఇటీ వలే అమెరికా వ్యాప్తంగా ఉన్న సుమారు 200 వార్తా సంస్థలతో వార్తలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. పాత్రికేయ వృత్తికి మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు మార్క్‌ జుకర్‌బర్గ్‌ని కొనియాడారు.