భర్తతో హనీమూన్‌ ‌కి వచ్చి ప్రియుడితో జంపైన నవ వధువు…!

Newly Wed Women Ran Away With Her Lover In Tamil Nadu

పెళ్లైన రెండు వారాల తర్వాత భర్తతో హనీమూన్‌కు వచ్చిన ఒక యువతి భర్త కళ్లుగప్పి తన ప్రియుడితో చెక్కేసిన ఘటన తమిళనాడులో చితు చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఉడుమలైపేట ప్రాంతానికి చెందిన యువతికి రెండు వారాల కిందట వివాహమైంది. అయితే, అప్పటికే ఆమె మరో యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే నవ దంపతులు హనీమూన్‌ కోసం సోమవారం నాడు కొడైకానల్‌కు చేరుకున్నారు.

police
అన్నాసాలైలోని ఓ లాడ్జిలో బస చేసి, రెండు రోజులపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ యువతి అదృశ్యమైంది. ఈ విషయం గురించి కుటుంబసభ్యులు, బంధువులకు భర్త సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పళనికి చెందిన ఓ యువకుడిని ఇది వరకే ఆమె ప్రేమించినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే ఈ వివాహం చేసుకున్న ఆ యువతి, ఆ యువకుడితో పారిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

new-couple