నీకేంట్రా నొప్పి.. నువ్వేమైనా కొన్నావా.. అంటూ మంచు లక్ష్మీ ఫైర్…!

నీకేంట్రా నొప్పి.. నువ్వేమైనా కొన్నావా.. అంటూ మంచు లక్ష్మీ ఫైర్…!
Latest News

మంచు లక్ష్మి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా రియాక్ట్ అవుతూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. మంచు లక్ష్మి ని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు కూడా. తాజాగా మంచు లక్ష్మి ఒక వ్యక్తి మీద ఫైర్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. వారం రోజుల క్రితం మంచు లక్ష్మి ఒక పోస్ట్ పెట్టింది ఎయిర్ ఇండియాని ప్రశ్నిస్తూ ఆ పోస్ట్ చేసింది.

నీకేంట్రా నొప్పి.. నువ్వేమైనా కొన్నావా.. అంటూ మంచు లక్ష్మీ ఫైర్…!
Manchu Lakshmi

ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ చెకింగ్ కౌంటర్ వద్ద రెడ్ కార్పెట్లు శుభ్రంగా లేవని సిబ్బందిని అడిగితే నవ్వుతున్నారని లక్ష్మి పోస్ట్ చేసింది. ఆ వీడియోను కూడా మంచు లక్ష్మి పోస్ట్ చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా మంచు లక్ష్మి పోస్ట్ మీద స్పందించింది. ముంబై ఎయిర్పోర్ట్ టీం కి దిశానిర్దేశం చేస్తామని చెప్పింది కానీ ఈమె చేసిన పోస్ట్ కొంతమందికి నచ్చలేదు.

నువ్వు బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నామని చెప్తున్నావా..? బిజినెస్ క్లాస్, ఐఫోన్ ని ఎలివేట్ చేద్దామని అనుకుంటున్నావా అర్థమైంది అంటూ మంచు లక్ష్మి ని టార్గెట్ చేశారు. దానికి మంచు లక్ష్మి స్పందిస్తూ నీకేంటి రా నొప్పి నువ్వేమైనా నాకు ఐ ఫోన్ కొన్నావా అంది.. ఎక్స్ లో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.