పయ్యావుల సెటైర్లు, రోజా కౌంటర్ !

paiyavula-setaires-roja-counter

వాడీవేడిగా జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సెషన్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో రోజంతా సభ హీటెక్కింది. సభలో వాడీ వేడి చర్చలే కాదు మధ్య, మధ్యలో సరదా సంభాషణలు జరిగాయి. ఒకరిపై మరొకరు చలోక్తులు విసురుకుంటూ ఎమ్మెల్యేలు కాసేపు సరదాగా నవ్వుకుంన్నారు.

సభలో మాటల తూటాలు పేల్చుకున్న ఎమ్మెల్యేలు లాబీల్లోకి రాగానే సెటైర్లు పేల్చుకుంటూ ఆసక్తికర సంభాషణలతో మీడియాకు కాస్త మసాలా తగిలించారు. బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజు కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ లాబీల్లో రోజాకు కేశవ్ ఎదురయ్యారట ఇద్దరూ పలకరించుకున్నారట.

రోజా ప్రసంగంలో వేడి తగ్గిపోయిందని కేశవ్ సరదాగా వ్యాఖ్యానించారట. అసెంబ్లీలో చంద్రబాబు లేరు అందుకే గట్టిగా తిట్టలేకపోయానని రోజా కౌంటరిచ్చారట. అదేంటో బాబును చూస్తే ఆటోమేటిక్‌గా తన ప్రసంగంలో ఫ్లో పెరుగుతుందనేశారట. వెంటనే అందుకున్న పయ్యావుల రోజా మౌనం వెనుక కారణం ఇంకేదో ఉందన్నారట.

తర్వాత టాపిక్ రోజా ప్రసంగం వైపు నుంచి పయ్యావుల అసెంబ్లీలో చేసిన ప్రసంగంవైపు మళ్లిందట. కేశవ్ ప్రసంగాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే రోజా.. చంద్రబాబు అసెంబ్లీలో లేని సమయం చూసి.. ‘మీరు సీఎం జగన్‌ను’ పొగిడారుగా అంటూ వ్యాఖ్యానించారట. వెంటనే స్పందించిన పయ్యావుల.. తాము తేవాలనుకున్న బిల్లును జగన్ తీసుకొచ్చారని అందుకే ప్రశంసించానని చెప్పారట. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారట