పాక్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం

పాక్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్‌గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి.

సైనికులపై కాల్పులు జరిపింది తామేనని నిషేధిత బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్‌గుర్‌లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్‌ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్‌ అభినందించారు.