తెలుగువాడి అణా దెబ్బ …

pattabhi seetharamaiah counter to sardar patel about on ana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు వారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న సమయంలో – ఇప్పటి ఆంధ్ర ప్రాంతం ‘ సమిష్టి మద్రాసు ‘ రాష్ట్రంలో ఉండేది. అప్పుడు ఆంధ్రుల ను అంధ్రేతర ప్రాంతాలలో ‘ మద్రాసీ ‘లని పిలిచేవారు.(ఇప్పటికీ ఉత్తర భారత దేశంలో తెలుగువారు అంటే ‘మద్రాసీ’లనే అభిప్రాయం చాలా మందిలో ఉంది).

ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు.

పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం,,, ఆంధ్ర రాష్ట్రం,,, ‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు … అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు ఎగతాళిగా మాట్లాడారు. అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ … ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) … మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది … కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ??? అంటూ చురక వేశారు. పటేల్ గారు ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న గాంధీజీ కూడా చిరునవ్వుతో ఉండిపోయారు. మహాత్మా గాంధీ గారి మాతృభాష కూడా గుజరాతీ భాషే.

భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే … తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించారు

మరిన్ని వార్తలు 

బీహార్ బాబుల పితలాటకం

జయ జానకి నాయక మూవీ టీజర్…

జేసీ ఏంటీ పిచ్చి ఆలోచన..?