ఆగ్రహావేశాలతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్

ఆగ్రహావేశాలతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ తన సతీమణితో క్రిస్మస్ సంబరాలను ముగుంచుకుని వచ్చిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఏపీ రాజకీయ నాయకులను పరుగులు పెట్టించేలా అమరావతి రైతులను కలిసి వారికి అండగా ఉంటానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.అందులో భాగం గానే నిన్న పవన్ అమరావతి రైతులను కలిసేందుకు వెళ్ళినప్పుడు పవన్ ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఘటనలు మనం చూసాము.

తుళ్లూరు ప్రాంతంలోని పోలీసుల దగ్గర పవన్ పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను దాటవేసి అటు వెళ్లారు.అయితే ఈ కారణాల చేత ఇప్పుడు తుళ్లూరు పోలీసులే పవన్ పై కేసు బనాయించాలని రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.పోలీసుల ఆంక్షలను దిక్కరించడమే కాకుండా సెక్షన్ 144 మరియు 30 లను ఉల్లంఘించారని అందుకే పవన్ పై వారే కేసు పెట్టాలని అనుకుంటున్నారని వచ్చిన వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.మరి దీనిపై పవన్ మరియు జనసేన శ్రేణులు ఎలాంటి స్పందనను కనబరుస్తారో చూడాలి.