ఢిల్లీకి వెళ్లనున్న జనసేన పార్టీ అధినేత

ఢిల్లీకి వెళ్లనున్న జనసేన పార్టీ అధినేత

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం పవన్ జనసేన పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల కు గానూ అబ్యర్దులను ఎంచుకొనే అవకాశం ఉన్నది. పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీ తో పొత్తు పెట్టుకున్న సంగతి అందరికి తెల్సిందే. ఈ స్థానిక ఎన్నికలకు బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. అభ్యర్థుల ఎంపిక పట్ల కీలక నిర్ణయం తీసుకోనున్నారు పవన్.

అయితే గత కొద్ది రోజులుగా సినిమాల్లో బిజీగా ఉంటున్న పవన్ రాజకీయ వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికలు దగ్గర పడనున్న నేపథ్యంలో పవన్ పర్యటన ఆసక్తికరంగా మారింది.బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం పవన్ ఈరోజు సాయంత్రానికి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది.