పయ్యావుల కేశవ్ ఇంట విషాదం

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. పయ్యావుల కేశవ్‌ తండ్రి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే అయిన పయ్యావుల వెంకట నారాయణప్ప ఈరోజు మృతి చెందారు. నారాయనప్ప వయస్సు ఇప్పుడు 83 సంవత్సరాలు.

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న కేశవ్ కి ఫోన్ దారా విషయం తెలియడంతో హూటాహుటిన అనంతపురం బయలుదేరి వెళ్లారు.

నారాయణప్ప మృతి పై సీఎం చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నారాయణప్ప మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.