చంద్రబాబుఫై సినీ నటుడు పోసాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుఫై సినీ నటుడు పోసాని సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనని అప్రతిష్ట పాలు చేస్తున్నారని చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల అండదండలతో, మన్ననలతో జగన్ ముఖ్యమంత్రి అయిన విషయాన్నీ గుర్తు చేసారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు కి ద్వేషమని, అందుకే కుట్రపన్ని జగన్ ని జైలుకి పంపారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనకు పోసాని మద్దతు తెలిపేలా పలు వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధి వికేంద్రీకరణ పాలనా సౌలభ్యం కోసం తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఎవరికీ అన్యాయం చేయరని, దయచేసి ఆందోళనలు, నిరసనలు విరమించాలని విజ్ఞప్తి చేసారు పోసాని. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి ఆమోదం మేరకు ఒక నిర్ణయం తీసుకుంటుందని, వైసీపీ ఎమ్మెల్యే ఫై దాడి సరికాదని పోసాని కృష్ణ మురళి అన్నారు.