కేటీఆర్ జాగ్రత్త…పాల్ వార్నింగ్

ఎన్నికల సమయంలో తనను చంపేందుకు కుట్ర జరిగిందని పేర్కోన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల సంఘం అధికారులు, సీఎం చంద్రబాబును కలిసినా తనకు సెక్యూరిటీని కల్పించలేదని ఆధారాలు సమర్పించినా పట్టించుకోలేదన్నారు. మోదీ, చంద్రబాబు, జగన్ తనకు శత్రువులన్న కేఏ పాల్ కేసీఆర్ మిత్రుడో, శత్రువో తెలియదని ఎన్నికల ముందు వరకు ఆయన తనకు మంచి స్నేహితుడన్నారు. కేసీఆర్ కేవలం ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని కేటీఆర్ తనపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. కేటీఆర్ పిచ్చి, పిచ్చి కామెంట్లు చేయొద్దు డబ్బు నీకు బాగా ఎక్కువైపోయినట్లుంది. నాతో పెట్టుకోవద్దు.. నేను కాంగ్రెస్ పార్టీని కాదు కొనడానికి కోదండరాంను కాదు. ఇక్కడ కేఏ పాల్ ప్రపంచాన్ని షేక్ చేసి ఓడించి గెలిచొచ్చా’అంటూ చెలరేగారు. ‘కేటీఆర్ గతవారం చూసావ్‌గా.. శ్రీలంక కర్ఫ్యూలో ఒక కుక్కకూడా కదలకూడదు. అలాంటిది ప్రెసిడెంట్, ప్రధాని నన్ను తీసుకెళ్లి టీ, కాఫీలిచ్చి, భోజనాలు పెట్టారు.ఆ దేశానికి పర్సనల్‌గా 10 మిలియన్లు నిధులు ఇచ్చాను వందలాది మిలియన్లు ఇప్పించాను. ఓ దేశానికి లాభం చేశాను.. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ కట్టారా.. చంద్రబాబు కట్టారా. వందలమంది బిలినీయర్లను హైదరాబాద్ తీసుకొచ్చాను.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్‌ను తీసుకొచ్చా.. నాతో గొడవ ఎందుకు పెట్టుకున్నావ్.. నేనేమన్నా కృష్ణమాదిగను అనుకున్నావా. నేను శపించానంటే మసైపోతావ్.. నువ్వు నీ కుటుంబం’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.