నిద్ర మత్తులో బస్సు బోల్తా

నిద్ర మత్తులో బస్సు బోల్తా

డ్రైవర్‌ నిద్ర మత్తులో తూగడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన రాప్తాడు వద్ద జాతీయ రహదారి-44పై మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన మేరకు… బెంగళూరుకు చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు (కేఏ51 ఏసీ 6440) హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు సోమవారం రాత్రి 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది.