పూరి జగన్నాథ్ కు తాళిబొట్టు కొనిచ్చిన యాంకర్ !

Puri Jagannath gets anchor

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా ప్రమోషన్స్ కొన్ని రోజులుగా బిజీగా ఉన్నాడు పూరీ. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు పూరి జగన్నాథ్. నిన్నే పెళ్ళాడుతా సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తన భార్యను చూసి ప్రేమలో పడ్డానని చెప్పాడు. ఆమెతో ప్రేమలో పడినప్పుడు ఒక్క రూపాయి కూడా జేబులో లేదని కానీ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఎర్రగడ్డలోని ఒక ఆలయంలో తమ పెళ్ళి జరిగిందని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్.

యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని సీనియర్ నటి హేమ పెళ్లి బట్టలు తీసుకు వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అక్కడే ఉన్న తమ స్నేహితులు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారని చక్కగా పెళ్లి బట్టలు కట్టుకుని తాళిబొట్టు కట్టేసి ఆ కూల్ డ్రింక్ తాగి పదకొండు గంటలకల్లా మళ్లీ నిన్నే పెళ్ళాడతా షూటింగ్ కి వెళ్లిపోయామని చెప్పాడు పూరి జగన్నాథ్. అక్కడ పెళ్లికి సంబంధించిన సినిమా చేస్తే ఇక్కడ నిజంగానే తాను పెళ్లి చేసుకున్నాను అని అంటూ నవ్వుకున్నాడు ఈ దర్శకుడు.