పూరిని మర్చిపోయిన మహేష్…థాంక్స్ చెప్పిన పూరి !

సూపర్ స్టార్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం మహర్షి. మహేశ్ బాబుకు ఈసినిమా చాలా ప్రత్యేకం అని చెప్పకోవాలి…ఎందుకంటే ఆయన కెరీర్ లో ఇది 25వ సినిమా. అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమా మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిన్న ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈకార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, విజయ్ దేవరకొండలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అయితే ఈవెంట్ లో మహేశ్ మాట్లాడుతూ.. ఈ అభిమానం,ప్రేమ ఇంకో 20 సంవత్సరాలు, 25 సినిమాలకి ఇలాగే ఉండాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఈసందర్భంగా తన కెరీర్ లో మంచి హిట్స్ ఇచ్చిన దర్శకులను గుర్తు చేసుకున్నారు. అయితే అందులో తనకు పోకిరి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ పేరు చెప్పలేదు. దీంతో ఫంక్షన్ ముగిసిన వెంటనే తన ట్వీట్టర్ ద్వారా స్పందించారు. నా స్పీచ్‌లో ఓ ముఖ్య‌మైన వ్య‌క్తి గురించి చెప్ప‌డం మ‌ర‌చిపోయాను. నా 25 సినిమాల ప్ర‌యాణంలో పోకిరి చిత్రం న‌న్ను సూప‌ర్ స్టార్ అయ్యేలా చేసింది. ఇందుకు పూరీ జ‌గ‌న్నాథ్‌కి కృత‌జ్ఞ‌తలు. పోకిరి చిత్రం ఎప్ప‌టికి గుర్తుండిపోయే చిత్రం అని తెలిపారు. ఇర ఆ ట్వీట్ చూసిన పూరీ జగన్నాథ్.. థ్యాంక్యూ సో మ‌చ్ స‌ర్.. మిమ్మ‌ల్ని ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటాం. మ‌హర్షి ట్రైల‌ర్ రాకింగ్ అని పోస్ట్‌ చేశాడు.