మరదలితో ఆ సంబంధం…అందుకే ఆయన్ని చంపేశా ?

తన భర్తకు అయన మరదలితో అక్రమ సంబంధం ఉందని, వారిద్దరికి పుట్టిన బిడ్డకు ఆస్తి రాసిచ్చే ప్రయత్న చేస్తున్నందునే అతడిని చంపేశానని చెప్పారు ఎన్డీ తివారి కొడుకు రోహిత్ తివారీ భార్య అపూర్వ పేర్కొంది. ఇదే విషయమై ఎన్నోసార్లు తమ మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే రోహిత్‌ను హత్య చేయాల్సి వచ్చిందని, రోహిత్ తనపై ప్రేమ చూపేవాడు కాదని, క్రూరంగా వేధించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అపూర్వను రిమాండ్‌లోకి తీసుకున్న పోలీసులు రెండ్రోజులుగా విచారిస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే రోహిత్‌ను హత్య చేయడానికి గల కారణాలను ఆమె పోలీసులకు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌‌కు చెందిన అపూర్వ శుక్ల లా చదివారు. ఇండోర్‌లో ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్న ఆమెకు రాజకీయాల్లో రాణించాలని ఉండేది. ఈ క్రమంలోనే ఓ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వెబ్‌ సైట్‌ లో రోహిత్ తివారీ వివరాలు చూసిన అపూర్వ మాజీ సీఎం కొడుకైన రోహిత్‌ను పెళ్లి చేసుకుంటే రాజకీయంగా ఎదగొచ్చన్న ఆశతో ఆయనను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రోహిత్‌లో వచ్చిన మార్పులు, మరదలితో వివాహేతర సంబంధం వల్ల బిడ్డ పుట్టిన విషయం తెలియడంతో ఆమె భర్తకు విడాకుల నోటీస్ పంపింది. ఆ తర్వాత రోహిత్‌ కు హార్ట్ సర్జరీ జరగడంతో మళ్లీ కలిసుండాలని ఇద్దరూ ఒప్పందానికి వచ్చారు. అయినప్పటికీ రోహిత్‌ తో పాటు అతడి తల్లి వ్యవహారశైలిలోనూ మార్పు రాలేదని, అత్త అనుమతి లేకుండా బెడ్‌రూమ్‌లో కనీసం కర్టెన్ మార్చడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదని అపూర్వ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తనకు అక్రమంగా పుట్టిన బిడ్డకు ఆస్తిలో వాటా ఇవ్వాలని రోహిత్‌ ను మరదలు డిమాండ్ చేయడంతో దానికి అతడూ అంగీకరించాడని, దీంతో మానసిక ఒత్తిడి గురై భర్తను హత్య చేయడానికి నిర్ణయించుకున్నట్లు అపూర్వ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు.